టాలీవుడ్ లో ఈమద్య కాలంలో కొత్త సినిమాలు వరుసగా ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.భారీ సినిమా ల జోలికి వెళ్లకుండా సింపుల్ గా చిన్న సినిమాలను ఒకటి రెండు కోట్లకు లేదా అంతకు తక్కువ కు కొనుగోలు చేసి ఆహా లో అల్లు వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఆకట్టుకునే విధంగా ఉండే సినిమాలను చూసి ఏరి కోరి మరీ స్ట్రీమింగ్ చేస్తూ తమ ఖాతాదారులను పెంచుతున్న ఆహా వారు మరో కొత్త సినిమాను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.కిరణ్ అబ్బవరం హీరోగా నటించి ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
థియేటర్లు ప్రారంభం అయిన వెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు.సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా జనాలు క్యూ కట్టడం లేదు.
థియేటర్ల ద్వారా విడుదల అయిన సినిమా లు మంచి వసూళ్లు రాబట్టలేని పక్షంలో వెంటనే కొత్త సినిమాగా ఉండగానే ఓటీటీ లో స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు.ఓటీటీ లో వెంటనే స్ట్రీమింగ్ చేయడం వల్ల అప్పటి వరకు ప్రమోషన్స్ చేయడం వల్ల తప్పకుండా మంచి వ్యూస్ వస్తాయి.చాలా మంది ఓటీటీ లో సినిమా లు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కనుక వెంటనే ఎస్ ఆర్ కళ్యాణ మండపంను ఓటీటీ ద్వారా విడుదల చేయడం వల్ల ఎక్కువ మందికి చేరువ అయ్యే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను ఆహా వారు మొదలు పెట్టారు.వచ్చే వారంలో ఆహా లో ఎస్ ఆర్ కళ్యాణ మండపం కు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.