తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఈరోజు ఉదయం వి.
ఐ.పి విరామ సమయంలో భారతీయ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన భారతీయ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి మీడియాతో మాట్లాడుతూ.గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా క్రీడా పోటీలకు ఏర్పడ్డ అంతరాయం తరువాత తిరుపతిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకం అని అన్నారు .
వెయ్యికి పైగా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరు అయినట్లు ఆమె తెలిపారు.క్రీడలను ప్రోత్సహించే విధంగా తిరుపతిలో నిర్వహిస్తున్నారని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్ధితుల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తే ప్రజల్లో నూతన ఉత్సాహం ను నింపేందుకు వీలవుతుందన్నారు.
ఈ క్రీడా పోటీలకు తిరుపతి ప్రజలు కూడా సహకరించడం సంతోషంగా ఉందని భారతీయ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి అన్నారు.