సోనూ సూద్ పేరు ఈ మధ్య కాలంలో బాగా వినపడింది.ఈయన చాలా సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అని అనిపించుకున్నాడు.
కరోనా సమయంలో ప్రజల కష్టాలకు స్పందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.ఎంతో మంది వలస కార్మికులకు ఆయన తన సొంత డబ్బులను ఉపయోగించి వారి ఇళ్లకు చేర్చడానికి బస్సులు, కార్లు, విమానాలు ఏర్పాటు చేసి వారిని వారి వారి స్వస్థలాలకు చేర్చాడు.
లాక్ డౌన్ తర్వాత కూడా ఎంతో మంది పేద విద్యార్థులకు, రైతులకు ఆయన అందించిన సేవలకు దేశం మొత్తం ఆయనను పొగడ్తలతో ముంచెత్తింది.మీరు రియల్ లైఫ్ హీరో అంటూ అభిమానులు ఆయనను కొనియాడారు.
ఐతే ఆయన చేసిన సేవలకు ఆయనకు ఒక అరుదైన గౌరవం దక్కింది.దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తన సొంత డబ్బులతో అయన ఫోటోను విమానంపై ముదిరించారు.
సోనూ సూద్ స్పైస్ జెట్ విమానయాన సంస్థతో కలిసి లాక్ డౌన్ లో రెండు లక్షల యాబై వేళా మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చింది.అంతేకాదు విదేశాల్లో చిక్కుకున్న 1500 మంది విద్యార్థులను ఇండియాకు తీసుకురావడంలో ఆయన సహాయ పడ్డారు.సోనూ సూద్ సహాయాన్ని అందుకున్న విద్యార్థులు మీరు దేవుడు సార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పుడు స్పైస్ జెట్ విమాన సంస్థ ఆయన సేవలకు గాను స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానంపై ఆయన ఫోటోను ముద్రించింది.
ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా పెట్టింది.ఆపద్బాంధవుడు సోనూసూద్ కు సెల్యూట్ అని పెట్టారు.ఈ విషయం తెలుసుకున్న సోనూ సూద్ కూడా ఆనందం వ్యక్తం చేసారు.నేను ఎల్లప్పుడూ ఇలానే నాకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటా అని ఆయన తెలిపారు.