విమానం ల్యాండ్ అవుతుండగా అకస్మాత్తుగా టైరు పేలిన సంఘటన తిరుపతి విమానాశ్రయంలో చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా తిరుపతి చేరుకున్న ఆ విమానం టైరు ల్యాండింగ్ సమయంలో పేలిపోయింది.విమానం ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా టైరు పేలినట్టు గుర్తించిన పైలెట్ వ్యవహరించి విమానాన్ని చాలా చాకచక్యంగా కిందికి దించాడు.
ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు.రేణిగుంట విమానాశ్రయంలో ఆ విమానం ఆగిన వెంటనే స్పైస్ జెట్ విమానానికి వెంటనే మరమ్మతులు నిర్వహించారు.
ఈ ఘటనతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు.ఇదే విమానం నిన్న కూడా ఆలస్యంగా రావడంతో ఇక్కడి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.