200 మంది మోడళ్లు కలిసి ఒక సముద్రం ఒడ్డున న్యూడ్ ఫోటో షూట్ చేసారు.మాములుగా అంత మంది మోడళ్లు ఒక చోట ఉంటేనే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.
అలాంటిది 200 మంది మోడళ్లు కలిసి సముద్రం ఒడ్డున న్యూడ్ ఫోటో షూట్ చేసారు.అయితే అంతమంది ఒకేసారి కలిసి న్యూడ్ ఫోటో షూట్ చేయడానికి ఒక కారణం ఉందట.
అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందా.
ఈ తతంగం అంత ఇజ్రాయిల్ దేశంలో జరిగింది.ఇజ్రాయిల్ లోని మృత సముద్రం వద్ద నిన్న ఆదివారం మధ్యాహ్నం 2.45 నిముషాలకు 200 మంది మోడళ్లు కలిసి నగ్నంగా ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నారు.ఆ 200 మోడళ్లు ఒంటికి తెల్లటి రంగు పూసుకుని ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నారు.అయితే ఇందుకు ఒక కారణం ఉంది.ఇజ్రాయిల్ లో నీటి సమస్య ఎక్కువ ఉంది.మృత సముద్రంలో జలాలు అంతకంతకు తగ్గిపోతుండడంతో ఈ పరిస్థితపై అవగాహనా కల్పించడం కోసం ఈ న్యూడ్ ఫోటో షూట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ఫోటో షూట్ లో ఇజ్రాయిల్, అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశానికీ చెందిన 19 నుండి 70 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు, పురుషులు పాల్గొన్నారు.
ఇజ్రాయిల్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్పెన్సర్ ట్యూనిక్ అనే 54 ఏళ్ల ఫోటో గ్రాఫర్ ఫోటో షూట్ చేసారు.ప్రతి ఏటా ఈ మృత సముద్రం ఒక మీటరు మేర ఎండిపోతుంది.ఇందుకు నీటిని మళ్లించడం ఒక సమస్య అయితే మైనింగ్ కూడా మరొక సమస్యగా ఉంది.
దీంతో ఈ విషయంపై అవగాహన పెంచడం కోసం పర్యావరణ శాఖ ఈ కార్యక్రమం చేపట్టింది.ఈ మృత సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువుగా ఉండడం వల్ల ఇందులో మనుషులు మునిగారు నీటిపైనే తేలుతారు.
అందుకే ఈ ఫోటో షూట్ లో పాల్గొనే మోడళ్లకు కూడా తెల్లటి రంగు వేశారని ఫోటో గ్రాఫర్ తెలిపాడు.ఈ న్యూస్ ఫోటో షూట్ వల్ల తమ దేశాల ప్రజలు అవగాహన పొందుతారని భావిస్తున్నారు.