మహిళలు పురుషులతో అన్ని పనులలో సమానం అనే భావన ఇప్పుడు దాదాపు అన్ని దేశాలలో ఉంది.అయితే మగవారు చేసే అన్ని పనులను మేము కూడా చేస్తామంటూ వారు చూపిస్తున్న తెగువకు జోహార్ కొట్టాల్సిందే.
అయితే ఈ తెగువ కొన్ని విషయాల్లో మనల్ని అవాక్కయ్యేలా కూడా చేస్తుంది.ముఖ్యంగా మగవారు మద్యానికి బానిసలై తమ ఇల్లును గొల్లు చేసుకునే అంశాలలో మహిళలు కూడా పోటీ పడుతుండటం ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం మహిళలు తమకు మద్యం సేవించేందుకు తగిన వెసలుబాటు లేదని ఫీల్ అవుతున్నారు.వీరి కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది.
కేవలం మహిళలు మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేసే వీలుగా మద్యం దుకాణాలు తెరిచేందుకు అక్కడి సర్కార్ రెడీ అవుతోంది.రాష్ట్రంలో మద్యం సేవించే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో వారికి ఈ వెసలుబాటు కలిపించాలని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.
ఇక మహిళలకే వెసలుబాటు ఉంటే తమ పరిస్థితి ఏమిటని మందుబాబులు వాపోతున్నారు.తమకు కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మరి ఈ మహిళా మద్యం దుకాణాల ఆలోచన ఎంతవరకు వర్కువుట్ అవుందనే సందేహం ప్రస్తుతం అందరిలో నెలకొంది.