షర్మిల ఫిర్యాదుపై విచారణ వేగవంతం !

సీనీ హీరో ప్రభాస్ – షర్మిల మధ్య ఏదో బంధం ఉందని అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను కొంతమంది ఉద్దేశపూర్వకంగానే… తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

 Special Team To Enquiry Into The Complaint Of Ys Sharmila Prabhas Rumors-TeluguStop.com

అడిషినల్ డీసీపీ రఘువీర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు.కాగా, సినీ హీరో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందంటూ కొంతమంది సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని.

వీరి వెనుక టీడీపీ నేతలున్నారని.ఈమేరకు ఇవాళ హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌కు షర్మిల ఫిర్యాదు చేశారు.

ఇదే విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.తన పిల్లల మీద ప్రమాణం చేసి ఈ విషయాన్ని చెబుతున్నానని.తనపై ఆరోపణలు చేస్తున్నవారు, చేయిస్తున్నవారు తనలా ప్రమాణం చేయగలారా అని షర్మిల ప్రశ్నించారు.తన భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులందరినీ ఈ దుష్ప్రచారం తీవ్రంగా బాధించిందని అన్నారు.

ఈ ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని స్పష్టం చేశారు.అయితే హైదరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేసిన వెంటనే ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.

ఆ తర్వాత ప్రాథమికంగా కొంత సమాచారాన్ని తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.వీలనైంత త్వరగా ఈ కేసుకు సంబందించిన విచారణ పూర్తి చేసేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube