దేశంలో అక్షరాస్యత శాతం రోజురోజుకు పెరుగుతోంది.చాలామంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు చదువుతున్నారు.
అంత చదువు చదివినా చాలామంది ఇంగ్లీష్ మాట్లాడటంలో మాత్రం విఫలమవుతున్నారు.ఇంగ్లీష్ లో నైపుణ్యం లేకపోవడం వల్ల చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లు దేశంలో ఎంతోమంది ఉన్నారు.
దేశంలో ఇలా దాదాపు 50 కోట్ల మంది ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతున్నారని ఒక అంచనా.
అనూరాధ అనే మహిళ రెండో కాన్పు తరువాత పుట్టింటికి రాగా అక్కడ కొందరు తమకు కూడా ఇంగ్లీష్ నేర్పించమని అడిగారు.
అయితే దేశంలో ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారని గుర్తించిన ఆమె ఒక యాప్ ద్వారా సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పాలని అనుకుంది.మల్టీ భాషీ యాప్ ద్వారా సొంత భాషల నుంచి ఇంగ్లీష్ సులభంగా నేర్చుకునేలా యాప్ ను తయారు చేసింది.
అమ్మ భాషే ముఖ్యమైనప్పటికీ ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ ఆవశ్యకమని అనూరాధ చెబుతోంది.11 భారతీయ భాషల ద్వారా దేశానికే ఇంగ్లీష్ నేర్పడం పనిగా పెట్టుకుంది.ప్రస్తుతం అనురాధ చెప్పిన పాఠాలను వింటూ 15 లక్షల మంది ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు.జైపూర్ కు చెందిన అనూరాధ బీటెక్ తో పాటు ఎంబీఏ చదివింది.మొదట వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆ తర్వాత ఫేస్ బుక్ ద్వారా అనూరాధ పాఠాలు చెప్పింది.
దేశంలో ఉన్నవాళ్లకు మాతృభాషలోనే పాఠాలు అర్థమయ్యేలా చేయాలని మల్టీ భాషీ యాప్ ను రూపొందించానని… 25 మంది కోర్ టీమ్ ను తయారు చేసుకుని ఈ యాప్ ను తయారు చేశానని… కేవలం 200 రూపాయలు చెల్లించి పాఠాలు వినవచ్చని ఆమె చెప్పారు.
స్త్రీలు అడ్డంకుల వల్ల ఆగిపోకూడదని ఆమె అన్నారు.మల్టీభాషీ యాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉందని ఈ యాప్ ను ఉపయోగించిన వాళ్లు చెబుతున్నారు.