మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాది నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.చాలా రోజుల తర్వాత హిట్ అందుకోవడంతో రవితేజ ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు.
రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఇక ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు.
రవితేజ కెరీర్ లో ఇది 68వ సినిమాగా తెరకెక్కబోతుంది.దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.
ఈయన ప్రకటించిన అరడజను సినిమాల్లో రావణాసుర ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.సుశాంత్ పాల్గొనే సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.తదుపరి షెడ్యూల్ లో రవితేజ జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది.
రావణాసుర సినిమాని అన్ని రియల్ లొకేషన్స్ లోనే చిత్రీకరించేలా మేకర్స్ స్పెషల్ గా షూటింగ్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది.ఈ మూవీ కోసం ఎలాంటి స్పెషల్ సెట్లు నిర్మించడం లేదని.తెలుస్తుంది.హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ సిటీ కాలేజ్ లైబ్రరీ వంటి ప్రముఖ ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.భారీ సెట్ల వల్ల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది.అందుకే ఈ సినిమాను కొత్తగా ప్లాన్ చేస్తున్నారట.