ఏడు నెలల క్రితం శానిటైజర్ అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు.అలాంటిది ఇప్పుడు శానిటైజర్ లేకుంటే అసలు ఇల్లు కూడా కదలరు.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా అందరికి శానిటైజర్, మాస్కులు అలవాటు అయ్యాయి.అయితే అలాంటి శానిటైజర్లలో కొన్ని జెల్ రూపం మరికొన్ని లిక్విడ్ రూపంలో అందుబాటులో ఉంటున్నాయి.
అయితే ప్రకాశం జిల్లాలో శానిటైజర్ మరణాలు జరగడం వల్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.ఆరీఫ్ హఫీజ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.లిక్విడ్ శానిటైజర్ బదులు జెల్ శానిటైజెర్లు మాత్రమే అమ్మాలి అని అయన ఆదేశించారు.ప్రకాశం జిల్లాలోని పలు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
అనంతరం ప్రకాశం జిల్లా పోలీసు స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో లిక్విడ్ శానిటైజర్ బదులు జెల్ శానిటైజర్లు మాత్రమే విక్రయించాలి అని అయన చెప్పారు.అంతేకాదు శానిటైజర్ తయారీదారులు, మెడికల్ షాపుల నిర్వాహకులు, మెడికల్ షాపుల అసోసియేషన్లతో మాట్లాడి అవగాహన కల్పించాలి అని అధికారులకు సూచించారు.