కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశారు.ఈ క్రమంలో కొంతమందిని సూపర్ స్ప్రెడర్స్ గా గుర్తించి వారికి మొదట వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పది రోజుల పాటు సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.శుక్రవారం మొదలైన ఈ ప్రోగ్రాం లో జి.
హెచ్.ఎం.సి పరిధిలో 21666 మందికి వ్యాక్సినేషన్ చేశారు.సూపర్ స్ప్రెడర్స్ ను నిత్య సేవకులుగా గుర్తించి వారికి పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ గా వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశారు.
గ్రెటర్ హైదరాబాద్ పరిధిలో ముంప్పై సర్కిల్స్ లో ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది.
డ్రైవర్స్, గ్యాస్ డెలివరీ బోయ్స్, బ్యాంక్ ఎంప్లాయీస్, పెట్రోల్ బంక్ స్టాఫ్, స్ట్రీట్ సేల్స్ మెన్ ఇలా కొందరిని గుర్తించి వారిని సూపర్ స్ప్రెడర్స్ గా భావించి వారికి టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే అలాంటి వారిని ముందుగానే గుర్తించి గురువారం నాడు టోకెన్లు అందచేశారు.వారికి ఇచ్చే వ్యాక్సి టైం కూడా ఆ టోకెన్ లో పేర్కొనడంతో ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.
హైదరాబాద్ నగరంలో చేపట్టిన ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ విధానాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిరా ఇంద్రారెడ్డి, సి.హెచ్ మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, కమీషనర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.