రాజద్రోహం కేసులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు ఇటీవల అక్కడి ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే.అయితే ఈ తీర్పుకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆయనకు మరణ శిక్ష అమలు చేసేలోపు చనిపోతే అయినప్పటికీ విడిచిపెట్టకూడదు అని, ఆయన చనిపోయినా మృతదేహాన్ని పార్లమెంటు ముందుకు ఈడ్చుకు రావాలి అంటూ అధికారులను ఆదేశించారు.అంతేకాకుండా మృతదేహాన్ని పార్లమెంటు బయట మూడు రోజుల పాటు వేలాడదీయాలంటూ ప్రత్యేక కోర్టు పేర్కొంది.
పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక కోర్టు ధర్మాసనం ముషారఫ్పై మంగళవారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.అయితే ఈ తీర్పుకు సంబందించిన 169 పేజీల పూర్తి పాఠాన్ని విడుదల చేయగా దానిలో ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది.శిక్ష విధించే లోపు ఆయన చనిపోయినా కూడా ఏమాత్రం వదలకుండా పార్లమెంట్ ముందు 3 రోజుల పాటు వేలాడదీయాలి అంటూ తన తీర్పులో వెల్లడించింది.
2007 నవంబరు 3న దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి, ఎమర్జెన్సీ విధించినందుకు ఆయనకు ఈ శిక్ష విధిస్తున్నట్లు ఇస్లామాబాద్లోని ప్రత్యేక కోర్టు ప్రకటించింది.పాక్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం ఇలా దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసినా, సస్పెండ్ చేసినా, దానికి తూట్లు పొడిచినా.దేశద్రోహం కిందకు వస్తుంది.ఈ నేపథ్యంలో ముషారఫ్ కు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది.