మన సమాజంలో పోలీసులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మన సంరక్షణకై అనునిత్యం పాటు పడుతూ ఉంటారు.ఈ క్రమంలో వారు మనతన అనే భేదాలు మర్చిపోయి తమ సహాయం అవసరమైన చోట సహాయం చేయడానికి పోలీసులు ఎప్పుడూ ముందుంటారు.
తాజాగా స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ తిరుమలకు పాదయాత్ర చేపట్టిన ఒక యువతి అస్వస్థతకు గురి కాగా ఆ యువతిని నాలుగు కిలోమీటర్ల మేర తన భుజాలపై మోసి ఆమె ప్రాణాలను కాపాడిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఈనెల 16న రాజంపేట మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి తిరుమలకు వేలాదిమంది భక్తులతో పాదయాత్ర చేపట్టారు.ఈ పాదయాత్రలో బుజ్జి అనే 20 సంవత్సరాలు కలిగిన ఓ యువతి పాల్గొంది.అయితే పాదయాత్ర సమయంలో అన్నమయ్య కాలిబాట మార్గంలో వెళ్తుండగా ఈ యువతి అస్వస్థతకు గురైంది.
దీంతో ఆమె నడవలేని స్థితిలో ఉంది. ఈ సంగతి గమనించిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ కులయప్ప ఆమెను వెంటనే తన భుజస్కంధాలపై మోస్తూ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలకు తీసుకెళ్లి స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.
సరైన సమయంలో యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లినందున యువతి ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదని వైద్యులు పేర్కొన్నారు.
ఇదంతా గమనిస్తున్న చుట్టుపక్కల ప్రజలు కులయప్ప నిజమైన హీరో అని ఆపదలో ఉన్న యువతిని రక్షించడానికి అతడిని ఆ గోవిందుడే పంపించాడని పొగడ్తలతో ముంచెత్తారు.
అంతేగాక యువతి పాదయాత్ర చేపట్టినటువంటి ప్రాంతం చాలా ఎత్తుపల్లాలతో కూడి ఉంటుందని పొరపాటును అడుగు పడాల్సిన చోటు కాకుండా ప్రక్కనకు పడకపోతే కింద పడిపోతారని అటువంటి ప్రాంతం నుండి సురక్షితంగా యువతిని ఆస్పత్రికి తెచ్చి చేర్పించిన కులయప్పను పలువురు అధికారులు, నాయకులు ప్రశంసిస్తున్నారు.
.