సరిలేరు నీకెవ్వరూ సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీని పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.సర్కారు వారి పాట టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన టైటిల్ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యి వైరల్ అయ్యింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బ్యాంక్ లలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన కార్పొరేట్ మాఫియా వ్యక్తుల నేపధ్యంలో కొనసాగుతుందని తెలుస్తుంది.ఈ కథ రీత్యా హీరో మెజారిటీ షూటింగ్ అమెరికాలో చేయాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా సెకెండ్ వేవ్ ఉంది.అక్కడ విపరీతంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో ముందుగా స్టార్ట్ చేయాలని అనుకున్న అమెరికా షెడ్యూల్ ని వాయిదా వేసేశారు.అయితే షూటింగ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో జనవరి నుంచి స్టార్ట్ చేయాలని పరశురామ్ ఫిక్స్ అయ్యాడు.
ఈ నేపధ్యంలో బ్యాంక్ నేపధ్యంలో సన్నివేశాలని ముందుగా షూట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.దానికోసం హైదరాబాద్ శివారులో బ్యాంకు సెట్ వేస్తున్నారని తెలుస్తుంది.ఈ సెట్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభించనున్నారు.ఇండియా షెడ్యూల్ కి సంబందించిన అన్ని సన్నివేశాలు పూర్తి చేసుకొని ఫైనల్ గా సెకండ్ షెడ్యూల్ లో అమెరికా వెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.మిగిలిన క్యాస్టింగ్ కి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.