కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబం మొత్తం కరోనా బారిన పడటం తెలిసిందే.భార్యతో పాటు కొడుకుతో సహ స్పీకర్ తమ్మినేని సీతారాం మహమ్మారి కరోనా బారినపడి చికిత్స తీసుకుని కరోనా నుండి కోలుకోవడం జరిగింది.
అయితే అనంతరం ఇంటికి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మళ్లీ తమ్మినేని సీతారాం అస్వస్థతతో గురి కావడంతో పాటు వెంటనే జ్వరం రావటం మరియు షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో జూన్ ఒకటవ తారీకు తాడేపల్లి లో మణిపాల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.
కరోనా నుండి కోలుకున్నాక మళ్లీ ఆరోగ్యం తిరగబడటం తో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో అప్పుడు సంచలనం సృష్టించింది.
దీంతో వెంటనే హాస్పిటల్ తమ్మినేని సీతారాం కి చికిత్స అందించి ఇటీవల వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఎటువంటి సమస్య లేదని తేల్చారు.అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం కొద్దిపాటి విశ్రాంతి హాస్పిటల్ లో తీసుకోవడం జరిగింది.
అనంతరం కోలుకొని తాజాగా డిశ్చార్జ్ అయ్యారు.తమ్మినేని సీతారాం కి ఎటువంటి సమస్యలు లేవని డాక్టర్ సుధాకర్ కంటిపూడి స్పష్టం చేశారు.
.