ప్రస్తుతం ఏ దేశంలో చూసిన కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.ఈ క్రమంలో కరోనాను జయించిన వేడుకలు చేసుకుంటున్న దేశాలను చూసి మిగతా దేశాలు కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న ఆవేదన కనపడుతూ ఉంది.
ముఖ్యంగా మన భారత దేశ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ప్రపంచంలో ప్రతి రోజు నమోదవుతున్న కరోనా కేసులలో సగానికి పైగా మన భారత దేశానివే కావడం విశేషం.
ఇది ఇలా ఉండగా స్పెయిన్ దేశంలో మాత్రం కరోనా వైరస్ ను తరిమేసి వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ వేడుకలో ఎక్కువగా యువతీ యువకులు పాల్గొని కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు ‘గో కరోన‘ వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా స్పెయిన్ దేశంలో ఆరు నెలలుగా అమలవుతున్న దానిని ఒక్కసారిగా ఎత్తివేయడంతో ప్రజలు వేడుకలలో మునిగితేలుతున్నారు.
వాస్తవానికి ఈ వేడుకలు అక్కడ జరుపుకునేందుకు అక్కడి వారు అర్హులే అని అనవచ్చు.
ఎందుకంటే 2020 నుంచి అక్కడ లాక్ డౌన్ అమలు అవుతుంది.అది కూడా కఠిన నిబంధనలతో అమలు అవ్వడం, కనీసం ఇళ్లలో నుంచి బయటికి వెళ్లే ఛాన్స్ కూడా లేకపోవడం విశేషం.కఠిన నిబంధనలతో అమలు చేసిన లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఆ దేశ ప్రజలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.అయితే స్పెయిన్ దేశంలో రోజుకు తక్కువ కేసులు నమోదు అవ్వడంతో ఇక అక్కడ లాక్ డౌన్ అవసరం లేదని ఎత్తి వేసింది.
తాజాగా స్పెయిన్ రాజధాని ప్రజలు అతి పెద్ద సంఖ్యలో ‘గో కరోనా’ వేడుకలను జరుపుకుంటున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.