సరిగ్గా 2019 ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ హత్య కేసుకు సంబంధించి వైసిపి అదేవిధంగా టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది.
అయితే ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉన్న సమయంలో.అనేక ఆటంకాలు కూడా కలిగాయి.
దాదాపు మూడు సంవత్సరాల నుండి విచారణ జరుగుతున్న ఈ కేసుకు సంబంధించి తాజాగా.కేసులో కీలక సాక్షి కల్లూరి గంగాధర్ రెడ్డి గురువారం మరణించడం సంచలనం రేపింది.
పోలీసులు గంగాధర్ రెడ్డి మృతిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి.ప్రధాన అనుచరుడిగా గంగాధర్ రెడ్డి కొనసాగారు.అయితే పది సంవత్సరాల క్రితమే పులివెందల వీడి.
అనంతపురం జిల్లా యాడికి లో గంగాధర్ రెడ్డి కుటుంబంతో నివాసముంటున్నారు.ఈ తరుణంలో బుధవారం రాత్రి తన ఇంటిలోనే గంగాధర్ రెడ్డి నిద్రించి గురువారం తెలవారే అయ్యేసరికి విగతజీవిగా కనిపించడం జరిగింది.
దీంతో వెంటనే.పోలీసులు రంగంలోకి దిగి క్షుణంగా పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప .గంగాధర్ రెడ్డి అనారోగ్యం కారణాలతో మరణించారని వెల్లడించారు.అలాగే పోస్టుమార్టంలో ఆయన మృతదేహంపై ఎటువంటి గాయాలు కనిపించలేదని వెల్లడించారు.