కరోనాతో బాధపడుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లుగా వైధ్యులు మరియు ఆయన తనయుడు చరణ్ చెబుతున్నారు.ఈ విషయంలో ఆయన అభిమానులు అంతా కూడా టెన్షన్ పడుతున్నారు.
సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అంతా కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఈ సమయంలో కొందరు ఈ విషయంలో సింగర్ మాళవికను టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆమె వల్లే బాలు గారికి కరోనా వచ్చింది అంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో గత నెల చివర్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలు గారు పాల్గొన్నారు.
అప్పటికే కరోనా లక్షణాలు ఉన్న మాళవిక ఆయన్ను కలిశారు అంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు.దాంతో ఆమె స్పందించింది.తన వల్ల బాలుగారికి కరోనా వచ్చినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు.అది ఏమాత్రం నిజం కాదు.
తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను.
నాపై ఆరోపణలు చేస్తూ పోస్ట్లు పెడుతున్న వారిపై సైబర్ క్రైమ్ వారికి ఫిర్యాదు చేయాలని భావిస్తుందట.
ఇప్పటికి అయినా తన పై చెడు ప్రచారం నిలిపేయాలంటూ విజ్ఞప్తి చేసింది.బాలు గారి ఆరోగ్యం విషయంలో తనకు కూడా ఆందోళన ఉందని ఆమె చెప్పుకొచ్చింది.తన వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తన గురించి చేస్తున్న తప్పుడు ప్రచారం ఇబ్బంది కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.