అనుకోని అతిథిలా వచ్చిన కరోనా దెబ్బ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి.వీటిని ప్రస్తుతం గాడిలో పెట్టి కరోనా ఉధృతిని కంట్రోల్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
అయినప్పటికీ అవి ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వట్లేదు.అందుకే ప్రస్తుతం రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.
వీటిని ఎలా కట్టడి చేయాలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి వసతులు కల్పించలేక ప్రభుత్వాలు తేలిపోతున్నాయి.
తేట తెలుగు గొప్పతనాన్ని తన మధురమైన స్వరంతో ప్రజలకు తెలిసేలా చేసిన ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గత కొంతకాలంగా కోవిడ్ పాజిటివ్ రావడంతో ఎంజీఎం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఇబ్బంది పడుతున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని భయపడాల్సిన పని ఏమి లేదని స్వయంగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.అయితే తాజాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం తన వివాహ వార్షికోత్సవాన్ని హాస్పిటల్ లో జరుపుకున్నారు.
శనివారం వివాహ వార్షికోత్సవ సందర్భంగా బాలు గారి సతీమణి ఐసీయూలో కేక్ ను కట్ చేసి బాలు గారితో కలిసి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.