ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషయంలో ఆందోళన నెలకొంది.కరోనా కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయిన బాలు గారు గత వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఆయనకు సీరియస్గా ఉండటంతో వెంటి లేటర్ ద్వారా శ్వాస అందిస్తున్నారు.ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు.
ఇదే సమయంలో కొందరు అభిమానులు టాలీవుడ్ సినీ ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తున్నారు.తెలుగు గాయకుడు అయిన బాలు గారి ఆరోగ్యం గురించి మీకు పట్టడం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాలు గారి ఆరోగ్యం విషయంలో చిరంజీవితో పాటు కొందరు మాత్రమే స్పందించారు.టాలీవుడ్కు చెందిన ఇంకా ప్రముఖులు ఎంతో మంది అసలు ఈ విషయం గురించి మాట్లాడనే లేదు.
దాంతో బాల సుబ్రమణ్యం ఫ్యాన్స్ ఈ విషయంలో వారిపై విమర్శలు చేస్తున్నారు.తమిళ సినీ ప్రముఖుల నుండి సీఎం క్యాంపు వరకు అందరు కూడా బాలు ఆరోగ్యం విషయంలో స్పందించారు.
ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు.ఈ విషయంలో బాలుపై వారు చూపిస్తున్న శ్రద్ద అంతా ఇంత కాదు.
తమిళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థనలు చేయడం బాలు గారు త్వరగా కోలుకోవాలంటూ కోరుకోవడం చేస్తున్నారు.టాలీవుడ్లో మాత్రం ఎంతో మంది స్టార్స్ బాలు గారి విషయంలో కనీస స్పందన చూపించడం లేదు.
ఇది ఏమాత్రం సరి కాదని బాలు గారు అంటే జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్న సింగర్.అలాంటి వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.