ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి మృతి ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించింది.టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.
మెగాస్టార్ చిరంజీవి నుంచి ఈ తరం యువ హీరోల వరకు ఆయనకు అభిమానులు ఆత్మీయులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి బాలు గారు కన్ను మూయడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన చివరి చూపు చూడడానికి కూడా వీలులేకుండా పోయింది.
కరోనా కారణంగా ఎక్కడ వాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి.ఆ కారణంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఆయనను కడసారి చూడలేకపోయారు.
అయితే చెన్నైలో ఉన్న ఆయన్ను తమిళ సినీ ప్రముఖులు కడసారి చూసే చూపు దక్కించుకున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ తో పాటు పలువురు దర్శకులు కడసారి చూసి వీడ్కోలు సమర్పించారు.
ముఖ్యంగా సూపర్ స్టార్ విజయ్ ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు.కరోనా కారణంగా అభిమానులకు అంత్యక్రియల్లో అనుమతి లేకపోయినా ప్రముఖులకు మాత్రం ప్రభుత్వం మరియు కుటుంబ సభ్యులు అనుమతించారు.
ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన ఈ అంత్యక్రియల్లో విజయ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఆ అవకాశం టాలీవుడ్ వారికి దక్కక పోవడం దురదృష్టకరం.మన హీరోలు ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు.మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు స్టార్ బాలుని చూసుకోలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఆయనకు సాదారణంగా అయితే ప్రధాని లేదా ఉపరాష్ట్రపతి వచ్చి అంతిమ సంస్కారాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.కాని కరోనా కారణంగా ఏ ఒక్కరు కూడా అంతిమ సంస్కారాల్లో పాల్గేనే అవకాశం లేకుండా పోయింది.
మొత్తానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయన వెళ్లి పోవడంను జీర్ణించుకోలేక పోతున్నారు.