కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాలతో ఆడుకుంటుంది.అందరిని భయపెడుతుంది.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిని తాకుతుంది.ఈ మహమ్మారి కారణంగా కొంత మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఎక్కువ మంది ట్రీట్మెంట్ తీసుకొని మరల సంతోషంగా బయటపడుతున్నారు.
అయితే కరోనా కారణంగా ఈ ఏడాది అందరి జీవితాలు ఏదో ఒక రకంగా విషాదాలతో నిండిపోయాయి.ఇదిలా ఉంటే కరోనా బారిన పడి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నారు.
ఇక తెలుగు లెజెండ్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు.అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారనే విషయాన్ని అతని కొడుకు దృవీకరించారు.
సెలబ్రిటీ ప్రముఖులు అందరూ ఆయన క్షేమం కోరుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు.
ఇంతలోనే వారి కుటుంబంలో మరో అలజడి చోటు చేసుకుంది.
బాలు భార్య సావిత్రికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కరోనా కారణంగా విషమ స్థితిలోకి వెళ్లి ఆయన మళ్ళీ కోలుకుంటున్నారు.ఈ సమయంలో అనూహ్యంగా బాలు భార్య కూడా కరోనా బారిన పడ్డారనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇళయరాజా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి సెలబ్రిటీలు బాలు ఆరోగ్యంతో క్షేమంగా తిరిగి రావాలని కాంక్షిస్తూ సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు.ఇక అభిమానులు కూడా పెద్ద ఎత్తున బాలు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఏది ఏమైనా ఈ ఏడాది సెలబ్రిటీల జీవితాలలో కూడా కరోనా ఈ ఏడాది చాలా విషాదం నింపుతుందని చెప్పాలి.ఇప్పటికే కరోనా కారణంగా షూటింగ్ లు ఖాళీ అయిన ఇండస్ట్రీలో ఇప్పుడు కరోనా వారికి సోకుతూ భయపెడుతుంది.
.