లెజెండ్రీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈమద్య కాలంలో పాటలు పాడటం చాలా వరకు తగ్గించారు.ప్రస్తుతం వస్తున్న పాటల్లో సాహిత్యం కంటే ఎక్కువగా చెత్త చెదారం ఉంటుందని, అసభ్యత, డబుల్ మీనింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయని, అందుకే బాలు గారు పాటలు పాడేందుకు ఆసక్తి చూపడం లేదు అంటున్నారు.
అయితే చాలా సంవత్సరాల తర్వాత రజినీకాంత్ నటించిన ‘పేట్ట’ సినిమాలో మరణ.అంటూ సాగే పాటను ఎస్వీబీతో పాడివ్వడం జరిగింది.
మరణ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.అనిరుథ్ సంగీత సారథ్యంలో ట్యూన్ అయిన ఆ పాటకు మంచి స్పందన వస్తున్నప్పటికి విమర్శలు కూడా మొదలయ్యాయి.తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో పేట్ట చిత్ర యూనిట్ సభ్యులు కూడా తల పట్టుకున్నారు.
ఇంతకు వివాదం ఏంటీ అంటే… మరణ పాటలో బాలు గారితో కొన్ని లైన్లను మాత్రమే పాడివ్వడం జరిగింది.పాటలోని ఎక్కువ శాతం మరో గాయకుడితో పాడివ్వడం జరిగిందట.పాటలోని కొంత భాగం మాత్రమే బాలుతో పాడివ్వడం అనేది బాలును అవమానించినట్లే అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లెజెండ్రీ గాయకుడితో ఒక పాటలోని కొన్ని లైన్స్ పాడివ్వడం ఏంటీ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే బాలు స్పందిస్తూ.
తాను రజినీకాంత్ గారి సినిమాకు చాలా సంవత్సరాల తర్వాత పాట పాడాను.చాలా సంతోషంగా ఉంది.
ఎంత పాడినా కూడా అది నాకు సంతోషంగానే ఉంటుందని ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.