ఒకప్పుడు నార్త్ సినిమాలను తెలుగులోకి రీమేక్ చేసేవారు టాలీవుడ్ దర్శకులు.అక్కడి సినిమాలను మనకు అనుగుణంగా మార్చేవారు.
ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది.సౌత్ సినిమాలను నార్త్ లోకి రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ దర్శకులు.
ప్రస్తుతం సౌత్ నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియన్ మూవీసే.దీంతో ఇక్కడి సినిమాలను అక్కడ రిమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా 25 తెలుగు సినిమాలు బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్నాయి.
నాని జెర్సీ మూవీ బాలీవుడ్ లోకి రీమేక్ అవుతుంది.
అక్కడ హీరో షాహిద్ కపూర్.త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
అటు అలవైకుంఠపురంలో సినిమా షెహజాద్ పేరుతో రీమేక్ అవుతుంది.హీరో కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ కృతీసనన్.
సూర్య సూపర్ హిట్ మూవీ ఆకాశమే నీ హద్దురా సినిమా అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ అవుతుంది.వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేశ్.
బచ్చన్ పాండే గా తెరకెక్కుతుంది.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమా హిందీలో అక్షయ్ హీరోగా మిషన్ సిండ్రెల్లా పేరుతో తెరకెక్కనుంది.
అటు కార్తీ హీరోగా చేసిన ఖైదీ సినిమాను అజయ్ దేవగణ్ హీరోగా భోళా అనే పేరుతో రీమేక్ అవుతుంది.అల్లరి నరేష్ నాంది సినిమా కూడా రీమేక్ చేస్తున్నాడు అజయ్.అటు దృశ్యం-2 కూడా హిందీలోకి రీమేక్ అవుతుంది.హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ హీరోలుగా విక్రమ్ నటించి వేదా రీమేక్ అవుతుంది.అపరిచితుడు సినిమాను రణ్ వీర్ సింగ్, కియారా అద్వానీ జంటగా శంకర్ రీమేక్ చేస్తున్నాడు.సమంతా నటించిన యూటర్న్ ను ఏక్తాకపూర్ బాలీవుడ్ లో రీమేక్ చేస్తుంది.
భీమ్లా నాయక్ సినిమా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు.
రామ్ రెడ్ సినిమాను సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా రీమేక్ చేస్తున్నారు.బన్నీ డీజే సినిమాను కూడా మల్హోత్రా రీమేక్ చేస్తున్నడు.మలయాళీ హిట్ హెలెన్ ను బాలీవుడ్ లో జాన్వి కపూర్ తో తీస్తున్నారు.మలయాళీ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ ను అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కలిసి రీమేక్ చేస్తున్నారు.ఎఫ్2ను కూడా బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నారు.ఛత్రపతిని వివి వినాయక్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు.లూసిఫర్ మూవీ హిందీలోనూ తెరకెక్కుతుంది.శింబు మానాడు కూడా రీమేక్ కు రెడీ అవుతుంది.బ్రోచేవారెవరురా ను హిందీలో తీస్తున్నారు.
కరణ్ డియోల్.అభయ్ డియోల్ హీరోలుగా చేస్తున్నారు.
జులాయి, క్రాక్, అరుంధతి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మానగరం, కోమలి, 16 సహా పలు సినిమాలు హిందీలో తెరకెక్కుతున్నాయి.