కరోనా వైరస్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయ్.
నిజానికి కరోనా వైరస్ అంతం అయ్యింది అని సడలింపు ఇచ్చిన చోటా కూడా కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడితో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన దక్షిణ కొరియాపై ఇప్పుడు మళ్లీ వైరస్ పంజా విసురుతోంది.
లాక్ డౌన్ ఎత్తివేసి బార్లు, నైట్ క్లబ్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఇప్పుడు అదే అనుమతి పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది.రాజధాని సియోల్ లోని ఓ క్లబ్ ద్వారా కరోనా వైరస్ కేసుల సంఖ్య దారుణంగా పెరిగింది అని అధికారులు వెల్లడించారు.
భౌతిక దూరం నిబంధనలు కూడా సడలించడం కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఒక కారణం అయ్యింది అని తెలుస్తుంది.దీంతో బార్స్.మద్యం మూసివెయ్యాలని ఆర్డర్ వేశారు.అంటే దీన్ని బట్టి చూస్తే.
సడలింపు కూడా పేద్ద ప్రమాదమే అని.ఇప్పుడు భారత్ లో కూడా సడలింపు ఇచ్చారు… మరి చివరికి ఏం అవుతుందో చూడాలి.