ఈ మధ్య జరుగుతున్న విషయాలను చూస్తుంటే సౌత్ స్టార్స్ బాలీవుడ్ స్టార్స్ కంటే ఏ విషయం లోను తగ్గేదే లేదు అంటున్నట్టు ఉంది.ఇక సౌత్ లో మన టాలీవుడ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది.
బాహుబలి సినిమాతో టాలీవుడ్ ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసాడు దర్శక ధీరుడు రాజమౌళి.ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మన స్టార్స్ అంత కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.
బాహుబలి తర్వాత మన సౌత్ సినిమాల్లో మళ్ళీ అంతటి ఘన విజయాన్ని అందుకుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమానే.దీంతో మరోసారి సౌత్ ఇండియా వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది.
మన సౌత్ ఇండియా హీరోలు అన్ని హద్దులు చెరిపేస్తూ బాలీవుడ్ లో పాతుకు పోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.ముఖ్యంగా మన టాలీవుడ్ హీరోలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తునందు.
ఆ ప్రయత్నాల్లో ముందుగా అల్లు అర్జున్ భారీ విజయం సాధించాడు.పుష్ప సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టిందనే చెప్పాలి.ఈ సినిమా హిందీ మార్కెట్ లో అందుకున్న విజయం తో ఇప్పుడు మరిన్ని సౌత్ ఇండియా సినిమాలు హిందీలో థియేట్రికల్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.
తెలుగు, తమిళ్ భాషల్లో భారీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచినా సినిమాలను హిందీలో రిలీజ్ చేయడానికి ఆయా సినిమా నిర్మాతలు పూనుకుంటున్నారు.ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా హిందీలో రిలీజ్ కు రెడీ అయ్యింది.ఇంకా రామ్ చరణ్ రంగస్థలం కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఇదంతా పుష్ప సక్సెస్ మహిమనే చెప్పాలి.