లాక్ డౌన్ టైంలో మొత్తం సినిమాలు అన్ని బంద్ అయిపోయాయి.సినీ కార్మికులకి ఉపాధి పోయి ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు.
ఇక వివిధ రంగాలలో పని చేస్తున్న వారు ఉపాధి కోల్పోయి లాక్ డౌన్ కారణంగా రకరకాల ఇబ్బందులకి ఎదుర్కొంటున్నారు.అయితే చాలా మంది సోషల్ మీడియాలో ఆదాయ మార్గంగా మార్చుకొని రెండు చేతులా సంపాదిస్తున్నారు.
సోషల్ మీడియాలో సంపాదిస్తున్నవారికి ఇప్పుడు కావాల్సినంత ఆదాయం వస్తుంది.ఈ విషయంలో మన టాలీవుడ్ అందాల భామలు ముందు వరుసలో ఉన్నారు.
సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు చేస్తూ ఫాన్స్ కి అందుబాటులో ఉండే ఈ భామలకి మంచి ఫాలోయింగ్ ఉంది.దీంతో కాజల్, తమన్నా, కృతి సనాన్ వంటి తారలు తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో కమర్షియల్ యాడ్స్ కు సంబంధించిన పోస్టింగులు పెడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఇన్ స్టాగ్రాంలో కాజల్ కు 14.5 మిలియన్ల ఫాలోవర్లు వుంటే, తమన్నాకు 10.5 మిలియన్ల ఫాలోవర్లు వున్నారు.దీంతో ఈ లాక్ డౌన్ సమయంలో తమ ఖాతాల ద్వారా ప్రమోషనల్ పోస్టింగులను పెడుతూ వీరు లక్షల్లో సంపాదిస్తున్నారు.
మామూలుగా సెలబ్రిటీలకి ఉన్న ఫాలోయింగ్ బట్టి ఒక్కో పోస్టింగుకి 5 నుంచి 10 లక్షల వరకు ఆయా సంస్థలు చెల్లిస్తుంటాయి.ఈ క్రమంలో కాజల్, తమన్నాలకు ఒక్కో పోస్టింగుకి సుమారు ఐదు లక్షలు వస్తున్నట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో ఇంట్లోనే ఖాళీగా వుండి కూడా ఈ ముద్దుగుమ్మలు లక్షల్లో సంపాదించుకుంటున్నారు.అయితే ఈ సంపాదనలో సౌత్ భామల కంటే బాలీవుడ్ భామలు మరింత స్పీడ్ గా ఉన్నారు.
అక్కడ హాట్ భామలు తమ అందాల ఫోటోలతో సోషల్ మీడియాలో యాడ్స్ ప్రమోషన్స్ చేస్తూ సినిమాలు లేకపోయిన లక్షల రూపాయిలు రెండు చేతులా సంపాదించుకుంటున్నారు .