సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైన్ టైమింగ్స్ లో మార్పులను చేసింది.కొన్ని ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ తో పాటుగా కొన్ని ప్యాసింజర్ ట్రైన్స్ యొక్క టైమింగ్స్ ను మార్చేసినట్టు ప్రకటించింది.
అంతేకాదు కొన్ని ప్యాసింజర్ ట్రైన్లను ఎక్స్ ప్రెస్ ట్రైన్లుగా మార్చుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.సౌత్ సెంట్రల్ రైవే పరిధిలో కొన్ని రైళ్ల రాకపోకల వేళలు మారుతాయని తెలుస్తుంది.
అంతేకాదు కొన్ని ట్రైన్స్ యొక్క రూట్ లను కూడా మార్చినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే తెలియచేసింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 872 రైళ్లలో 673 రైళ్ల వేగాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.
దీనితో పాటుగా కొన్ని రైళ్ల టర్మినల్ స్టేషన్లలో మార్పులు చేశారు.ఈ మార్పులు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది.
అయితే ఇప్పటికే ఆన్ లైన్ లో అడ్వాన్స్ గా బుక్ చేసుకున్న వారు ఇప్పుడు వారి టికెట్ల గురించి ఆలోచనలో పడ్డారు.కొన్ని ట్రైన్స్ టైమింగ్స్ లో మార్పుల వల్ల చాలామంది ప్రయాణీకులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నా టైమింగ్స్ ప్రాబ్లం వల్ల తమ టికెట్ క్యాన్సల్ చేసుకోవడం లేదా వారి ప్లాన్ మార్చుకోవడమో చేయాల్సి ఉంటుంది.