టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ త్రిష పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రిష వరుస సినిమాలతో తెగ అవకాశాలు అందుకుంది.
స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.అంతేకాకుండా ఈ బ్యూటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.మొదట్లో ట్రెడిషనల్ లుక్ తో కెరీర్ ని మొదలు పెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత గ్లామర్ ను పరిచయం చేసింది.
2003లో నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన త్రిష ఆ తర్వాత స్టార్ హీరో ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.అలా వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది.ఇక నాయకి అనే హారర్ మూవీ లో కూడా నటించగా ఈ సినిమాతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పి తమిళంలో అడుగు పెట్టి బాగా బిజీ గా మారింది.
ఇక టాలీవుడ్ లో ఇప్పటివరకు మళ్లీ నటించకపోగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా సూపర్ హిట్ డైరెక్టర్ సినిమాకి నో చెప్పిందట ఈ బ్యూటీ.
ఇటీవలే చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే నో చెప్పింది త్రిష.ఇక ఈ మధ్య ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుందని వార్తలు వినిపించాయి.
దీంతో లేడి ఓరియంటెడ్ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి త్రిష కోసం స్క్రిప్ట్ ను రాసి వినిపించాడట.దీంతో ఆమెకు కథ నచ్చకపోవడంతో నో చెప్పిందని తెలుస్తోంది.
నిజానికి ఇప్పటివరకు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎటువంటి అపజయాన్ని ఎదుర్కోలేదు.అటువంటిది త్రిష కోసం పైగా తను లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపడంతో అది దృష్టిలో పెట్టుకున్న అనిల్ రావిపూడి తనకోసం మంచి కథ రాయడంతో కాదనుకుందని తెలిసింది.