తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ త్వరలో చేరిక కాబోతున్నాడంటూ జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.ఈ ప్రచారం మొదలుకావడానికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్ అని చెప్పవచ్చు.
దొంగచాటుగా రేవంత్, ఈటెల కలుసుకున్నారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత ఈటెల గెలుపొందడం బీజేపీ గెలుపు కాదు, ఇది ఈటెలదని ఫలితాల విడుదల రోజే ప్రచారం జరిగింది.
ఆ తరువాత బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ స్పందించి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయినా కాంగ్రెస్ లోకి ఈటెల వెళ్తున్నాడన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు.
దీనిపై ఈటెల రాజేందర్ స్వయంగా స్పందిస్తే తప్ప ఈ తరహా ప్రచారాలకు పుల్ స్టాప్ పడే అవకాశం లేదు.ఇటువంటి ప్రచారం జరగడానికి ముఖ్య కారణం ఈటెల కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి కావడమే.
కమ్యూనిస్ట్ భాజాలం కలిగిన వ్యక్తులు బీజేపీ లాంటి మతతత్వ పార్టీలో కొనసాగడం కష్టం అనేది చాలా మంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.
అయితే ప్రస్తుతం ఈటెల కేసీఆర్ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కాబట్టి భావజాలం అనే ప్రస్తావన వస్తుందా అంటే కొంత సందేహమనే చెప్పవచ్చు.అంతేకాక ఇప్పుడు కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ చాలా వరకు బలంగా ఉంది.ఈ సమయంలో పార్టీ మారే రిస్క్ ఈటెల రాజేందర్ చేస్తారా అంటే చేయారనే చెప్పాలి.
అయితే ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరిగినా ప్రస్తుత పరిస్థితి ఆధారంగానే ఎవరైనా నిర్ణయం తీసుకుంటారని, భావజాలం ఆధారంగా పార్టీలలో చేరే సంస్కృతి ఇప్పుడు లేదని కావున ఈటెల కాంగ్రెస్ లో చేరే అంశం మాత్రం వట్టి ప్రచారంలా మాత్రమే మిగిలి ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.