టాలీవుడ్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాల్లో విలన్ గా నటించి స్టార్ విలన్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు సోనూసూద్.విలన్ గా వచ్చిన గుర్తింపు కంటే లాక్ డౌన్ సమయంలో చేసిన సహాయాల ద్వారా ఊహించని స్థాయిలో సోనూసూద్ పాపులారిటీని సంపాదించుకున్నారు.
పేద ప్రజలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం కోసం సోనూసూద్ ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం గమనార్హం.
ట్విట్టర్ ద్వారా కష్టాలను తెలుసుకుంటూ సహాయం అందిస్తున్న సోనూసూద్ ఇప్పుడు తన పేరును అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్లకు వార్నింగ్ ఇస్తూ వార్తల్లో నిలిచారు.
సోనూసూద్ కు ప్రజల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో కొందరు మోసగాళ్లు సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో అక్రమాలకు తెర లేపారు.సోనూసూద్ ఫౌండేషన్ 5 లక్షల రూపాయల లోన్ ఇస్తోందని ఈ లోన్ పొందాలంటే 3,500 చెల్లించాలని అమాయకులను టార్గెట్ చేసి మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ఎవరైతే 3,500 రూపాయలు ముందుగా చెల్లిస్తారో వారు మాత్రమే లోన్ పొందగలుగుతారని మోసగాళ్లు జోరుగా ప్రచారం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న విషయం సోనుసూద్ దృష్టికి వచ్చింది.తాను ఇలాంటి రుణాలను ఇస్తానని ఎక్కడా చెప్పలేదని సోనూసూద్ పేర్కొన్నారు.9007224111 నంబర్ తో మోసగాళ్లు కాల్ చేస్తున్నారని ఈ కాల్ వచ్చే నంబర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సోనూసూద్ సూచించారు.
సోనూసూద్ ముంబై, యూపీ పోలీసులకు ఈ మోసాలకు సంబంధించి ఫిర్యాదు కూడా చేశారు.
మరోవైపు సోనూసూద్ త్వరలో ఇండియాలో అతిపెద్ద బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించబోతున్నట్టు ఒక వీడియోను విడుదల చేశారు.మనుషుల ప్రాణాలను కాపాడాలంటే డాక్టర్ కాకపోయినా బ్లడ్ డొనేటర్ కావాలని సోనూసూద్ తెలిపారు.
మోసగాళ్ల మాటలను నమ్మి మోసపోవద్దంటూ సోనూసూద్ ప్రజలకు కూడా కీలక సూచనలు చేయడం గమనార్హం.