తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విలన్ గా సోనూ సూద్ మనందరికీ సుపరిచితమే.అతడు, దూకుడు, జులాయి, అరుంధతి, ఆగడు సినిమాల్లోని పాత్రలు విలన్ గా సోనూసూద్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అయితే విలన్ గా మాత్రమే గుర్తింపు ఉన్న సోనూ సూద్ కు కరోనా, లాక్ డౌన్ సమయంలో వలసకార్మికుల కోసం, పేదల కోసం చేసిన సాయం వల్ల రియల్ హీరోగా గుర్తింపు వచ్చింది.సినిమాల్లో విలన్ అయినా రియల్ లైఫ్ లో హీరో అని ప్రశంసలు దక్కాయి.
సోనూ సూద్ చేసిన సాయాల గురించి తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఆయనను ప్రశంసించారు.అయితే పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే విధంగా కొందరు నెటిజన్లు మాత్రం సోనూ సూద్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
సోనూ భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాడని.అందువల్లే ఈ విధంగా పేదలకు, వలస కార్మికులకు సాయం చేశాడని కొందరు చెబుతుంటే.మరి కొందరు సోనూ సూద్ కు అంత డబ్బులు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూ సూద్ తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు స్పందించి సమాధానం ఇచ్చారు.
జనాలు తన ఆర్థిక స్థితిపై ఒక అంచనాలో ఉన్నారని కానీ వారి అంచనాలను మించిన ఆస్తి తన దగ్గర ఉందని సోనూ తెలిపారు.ఎంతోమంది తనకు సహాయం చేస్తున్నారని.
ఆ డబ్బుతో పాటు తన డబ్బును కూడా సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నానని చెప్పి సాయం వెనుక ఉన్న అజ్ఞాతవ్యక్తుల గురించి వెల్లడించారు.
తమ కుటుంబానికి బిజినెస్ లు ఉన్నాయని.
ఆ బిజినెస్ లు మంచి లాభాల్లోనే నడుస్తున్నాయని సోనూసూద్ తెలిపారు.వ్యాపారాల నుంచి వచ్చే డబ్బులతో పాటు నటుడిగా తాను బాగానే సంపాదించానని వెల్లడించారు.
ఎంతోమంది సాయం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అందువల్లే తాను ఇతరులకు సహాయం చేయగలుగుతున్నానని పేర్కొన్నారు.పలు పార్టీల నుంచి రాజకీయాల్లోకి రావాలని ఆఫర్లు వచ్చాయని.
తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని సోనూ వెల్లడించారు.