కరోనా లాక్ డౌన్ టైంలో వలస కార్మికులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సాయం చేసిన ప్రముఖ నటుడు ఆ తర్వాత కూడా తన మంచితనం ను చాటుకున్న విషయం తెలిసిందే.కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో వందల మందికి తన వంతు సాయాన్ని అందించారు.
ఎద్దులు లేని రైతుకు ట్రాక్టర్ ని అందించిన సోనుసూద్ కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న అమ్మాయికి తన వంతు ఆర్థిక సాయం చేశారు.అలాగే ఒక అమ్మాయి చదువు కోసం నెట్ వర్క్ సమస్యను పరిష్కరించి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పేద విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తానంటూ ఇటీవలే సోనూసూద్ ప్రకటించాడు.తన తల్లి కోరిక మేరకు పేద విద్యార్థుల కోసం ఈ పని చేయబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇందుకోసం దేశంలోని అనేక విశ్వ విద్యాలయాల తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.ఇన్ని మంచి పనులు చేస్తున్న సోనూసూద్ కు ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు సత్కారాలు లభిస్తున్నాయి.
తాజాగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ కోసం నేడు హైదరాబాద్ వచ్చాడు.హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఆయనకు నీరాజనాలు పలికారు.
అల్లుడు అదుర్స్ యూనిట్ సభ్యులు కూడా సోనూసూద్ కు సన్మానం చేశారు.
ప్రకాష్ రాజు నేతృత్వంలో ఆయనకు పుష్ప గుచ్చం అందించి శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ సోనూసూద్ చేసిన మంచి పని ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని అన్నారు.
అల్లుడు అదుర్స్ షూటింగ్ లో నేటి నుండి ఆయన పాల్గొనబోతున్నాడు.సీత సినిమా తర్వాత మళ్లీ సోనూసూద్ మరియు బెల్లంకొండల కాంబో అల్లుడు అదుర్స్ తో రాబోతుంది.