రియల్ హీరో సోనూసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సామాన్య ప్రజలతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సహాయం చేస్తూ సహాయ కార్యక్రమాల ద్వారా సోనూసూద్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
పేద ప్రజలు దేవుడిగా కొలుస్తున్న సోనూసూద్ తల్లి పుట్టినరోజు నేడు.తల్లి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన సోనూసూద్ ఎమోషనల్ అయ్యారు.
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అమ్మ తనకు నేర్పిన జీవిత పాఠాలకు సోనూసూద్ ధన్యవాదాలు తెలిపారు.అమ్మకు తాను వ్యక్తిగతంగా విష్ చేయాలని కోరుకుంటున్నానని సోనూసూద్ పేర్కొన్నారు.
తాను పోస్ట్ చేస్తున్న ఈ సందేశాలు అమ్మను తను ఎంతగా మిస్ అవుతున్నానో ఎప్పటికీ వ్యక్తపరచలేవని సోనూసూద్ చెప్పుకొచ్చారు.అమ్మ లేకపోవడం వల్ల తన లైఫ్ లో శూన్యం ఏర్పడిందని సోనూసూద్ అన్నారు.
అమ్మను మళ్లీ చూసేంత వరకు ఆ శూన్యం తన జీవితంలో అలాగే ఉంటుందంటూ సోనూసూద్ తెలిపారు.సోనూసూద్ తన తల్లికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం గమనార్హం.2007 సంవత్సరంలో సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ మృతి చెందారు.సోనూసూద్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెటిజన్ల మనస్సును కదిలిస్తూ ఉండటం గమనార్హం.
తల్లి నుంచి సేవాగుణాన్ని అలవరచుకున్న సోనూసూద్ ఎంతోమందికి సాయం చేస్తున్నారు.సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ సోనూసూద్ పేదల పాలిట ప్రాణదాతగా నిలుస్తుండటం గమనార్హం.తెలుగులో ప్రస్తుతం సోనూసూద్ ఆచార్య సినిమాలో నటిస్తుండగా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.సోనూసూద్ నటించబోయే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
సోనూసూద్ పాలిటిక్స్ లోకి రావాలని అతని అభిమానులు ఆశిస్తున్నారు.