లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోగా పేరును సంపాదించుకున్న సోనూసూద్ తన సహాయాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు కష్టాలు పడుతున్న నేపథ్యంలో సోనూసూద్ మళ్లీ తనవంతు సహాయాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
పట్టణాల నుంచి మారుమూల పల్లెల్లో ఉన్నవాళ్ల వరకు అందరికీ సోనూసూద్ తనవంతు సహాయం చేశారు.తాజాగా సోనూసూద్ ప్రముఖ ఛానెల్ ,లో ప్రసారమవుతున్న డ్యాన్స్ దీవానే షోకు హాజరయ్యారు.
ఆ ప్రోగ్రామ్ లో ఒక పేద కళాకారుడు డ్యాన్స్ చేయగా ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్ ను చూసి సోనూసూద్ కంటతడి పెట్టుకున్నారు.కంటెస్టెంట్ లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.
కష్టాలు పడుతున్న పేదలను ఆదుకోవడం కొరకు సోనూసూద్ అందిస్తున్న సేవలను సైతం అతను చూపించాడు.ఆ కళాకారుని యొక్క టాలెంట్ ను చూసి సోనూసూద్ ఫిదా అయ్యారు.
డ్యాన్స్ చేసిన కంటెస్టెంట్ గురించి సోనూసూద్ మాట్లాడుతూ నువ్వు కూడా రియల్ హీరోవని నువ్వు చిన్న టౌన్ లో పెద్ద స్టార్ వని సోనూసూద్ ప్రశంసించారు.డ్యాన్స్ చేసిన కంటెస్టెంట్ సోనూసూద్ చెప్పిన మాటలకు సంతోషించారు.
ఆ తరువాత ఆ కంటెస్టెంట్ లాక్ డౌన్ సమయంలో మా గ్రామ ప్రజలు కష్టాలు పడ్డారని చెప్పుకొచ్చారు.తిండి కొరకు కూడా గ్రామప్రజలు కష్టాలు అనుభవించారని ఆ కంటెస్టెంట్ చెప్పుకొచ్చారు.
కంటెస్టెంట్ చెప్పిన మాటలకు ఎమోషనల్ అయిన సోనూసూద్ లాక్ డౌన్ ఎన్నిరోజులు కొనసాగినా మీ గ్రామానికి సరిపడా రేషన్ ను తాను అందిస్తానని పేర్కొన్నారు.ఎటువంటి సమస్యలు లేకుండా రేషన్ అందే విధంగా సహాయం చేస్తానని వెల్లడించారు.
మరోవైపు సోనూసూద్ సినిమాలతో బిజీగా ఉన్నారు.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో సోనూసూద్ నటిస్తున్న అంగతి తెలిసిందే.