27 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనూసూద్కు ఎన్నడూ రానంత పేరుప్రఖ్యాతలు కరోనా కాలంలో వచ్చాయి.నిజజీవితంలో ప్రజలకు ఆపద్బాంధవుడిగా మారడమే ఇందుకు కారణం.
కరోనా కాలంలో అతను నిరుపేదలకు అందించిన సేవలు మరువలేనివి.నిజానికి ఆయన ఇప్పటికీ చేస్తున్న సహాయ కార్యక్రమాలను సైతం ప్రతి ఒక్కరి మెప్పును పొందుతున్నాయి.
అనారోగ్యం బారిన పడ్డ బిడ్డ బతకాలని తల్లిదండ్రులు తల్లడిల్లుతుంటే.సోనూ వైద్య ఖర్చులు భరించి ఆ బిడ్డ ప్రాణాలను కాపాడారు.
మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందేలా చేస్తున్నారు.
ముంబైలో శక్తి అన్నదానం కార్యక్రమం ద్వారా ప్రతిరోజూ ఒక లక్షా 50 వేల మందికి ఉచితంగా భోజనాలు పెడుతున్నారు.
రైతులకు సహాయం చేస్తూ.నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తూ.
ప్రకృతి విపత్తుల్లో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు.కనీవినీ ఎరుగని రీతిలో అతను కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తుండడం చూసి భారతీయ ప్రజలందరూ అతన్ని అభిమానించడం ప్రారంభించారు.
సోనూపై తమ ప్రేమాభిమానాలను వ్యక్తపరచడానికి చాలా మంది అభిమానులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమిన్ అనే ఒక వ్యక్తి ఏకంగా సిమ్ పైనే సోనూ బొమ్మ గీసి ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.అయితే ఒక చిన్న సిమ్పై సోనూ బొమ్మ ఎంతో చక్కగా గీయడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ క్రమంలో సోనూ కూడా ఈ పెయింటింగ్ పై స్పందించారు.
సోమిన్ ట్వీట్ ని కోట్ చేస్తూ ఫ్రీ 10జీ నెట్వర్క్ సిమ్అని సోనూ పేర్కొన్నారు.దీంతో సోమిన్ తెగ సంతోషిస్తున్నాడు.
కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ ట్వీట్ కి 12 వేల లైక్స్ వచ్చాయి.