పేదల కోసం సోనుసూద్ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం..!!

దేశంలో చాలా మంది హీరోలు ఉన్నా గాని పేద వాళ్లకు ఎక్కువగా ఉపయోగపడి రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.కరోనా లాక్ డౌన్ సమయం నుండి ఇప్పటి వరకు అనేక మందికి దేశవ్యాప్తంగా పలు సహాయ కార్యక్రమాలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.

 Sonu Soods Decision For The Poor Is A Sensation All Over The Country, Sonu Sood,-TeluguStop.com

ఇటీవలే హైదరాబాద్ నగరంలో అంబులెన్స్ ఉచిత సర్వీసులు కూడా ఓపెన్ చేయడం జరిగింది.ఇదిలా ఉంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత ప్రస్తుతం  విద్యావ్యవస్థలో అనేక మార్పులు రావటంతో.

పేదల కోసం సోనూసూద్ తీసుకున్న సరికొత్త నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మేటర్ లోకి వెళ్తే చాలావరకూ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాయి.

దీంతో పేద కుటుంబాలు తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్ లు కొనలేని పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో అలాంటి వారిని ఆదుకోవడం కోసం, చదువుకోవాలి అని ఆశ ఉన్నా గాని పరిస్థితులు అనుకూలించలేని పేదలకోసం సోను సూద్ ప్రముఖ “ఏంఐ” అనే దిగ్గజ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

 దేశవ్యాప్తంగా పేదల చదువుకు ఉపయోగపడాలి అనుకునేవాళ్ళు తమ సెకండ్ హ్యాండ్ “స్మార్ట్ ఫోన్” లు విరాళంగా అందించవచ్చు అంటూ అనే ఈ వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చారు.ఈ క్రమంలో ఆ ఫోన్లు మరింత శక్తివంతంగా పనిచేయడానికి “ఏంఐ” అనే కంపెనీ ఆ ఫోన్లను వర్క్ షాపులో బాగు చేసి పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానుంది.

దీంతో సోనూసూద్ పేదల కోసం తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube