అంబానీపై అదిరిపోయే పంచ్ వేసిన సోనూ సూద్.. !

కరోనా, లాక్ డౌన్ కాలంలో పేదలకు, వలస కార్మికులకు, విద్యార్థులకు తన వంతు సహాయం చేసి సోనూ సూద్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఒకప్పుడు విలన్ పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

 Sonu Sood Superb Punch To Billionaire Mukesh Ambani, Mukesh Ambani, Corona, Lock-TeluguStop.com

సంపాదించిన డబ్బులో కొంతమొత్తం సోనూ సూద్ దానధర్మాలకే ఖర్చు చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, కోట్లలో పారితోషికం తీసుకునే స్టార్ హీరోలు సైతం సహాయం చేయడానికి వెనుకడుగు వేయగా సోనూ సూద్ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసి తక్కువ ఆదాయంతో జీవించే వాళ్లను ఆదుకున్నారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సోనూ సూద్ తాజాగా ట్విట్టర్ వేదికగా ముఖేశ్ అంబానీపై అదిరిపోయే పంచ్ వేశారు.సోనూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సోనూ తన ట్వీట్ లో కరోనా సమయంలో “పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు” అని పేర్కొన్నారు.ప్రత్యక్షంగా ముకేశ్ అంబానీ పేరును సోనూ సూద్ ప్రస్తావించకపోయినా లాక్ డౌన్ సమయంలో ముఖేశ్ సంపద ఏకంగా 22 బిలియన్ డాలర్లు అభివృద్ధి చెందడంతో ఆయనకే సోనూ సూద్ పంచ్ వేశాడని సులభంగా అర్థమవుతుంది.
కరోనా, లాక్ డౌన్ సమయంలో కేంద్రం తీసుకున్న చర్యలు సైతం సామాన్యుల కంటే ధనికులకే ప్రయోజనం చేకూర్చాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ముకేశ్ అంబానీ దేశంలో సంపద పరంగా ఉన్నత స్థానంలో ఉన్నా కరోనా సమయంలో పేదలకు పెద్దగా సాయం చేసిన దాఖలాలు లేవు.

దీంతో సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా ముఖేశ్ అంబానీపై పంచ్ వేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube