విలన్ గా ఇండియన్ సినిమాలలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు సోనూసూద్.అరుంధతి సినిమాతో ఒక్కసారిగా పవర్ విలన్ క్యారెక్టర్స్ కి సోనూసూద్ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు.
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా మెప్పించిన సోనూసూద్ బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలకి విలన్ గా తన బ్రాండ్ ని కొనసాగించాడు.అయితే అతన్ని లాక్ డౌన్ ముందు వరకు అందరూ ఒక నటుడు గానే ఆదరించారు.
అయితే లాక్ డౌన్ సమయంలో అతను చేసిన సేవా కార్యక్రమాలతో ఒక్కసారిగా రియల్ హీరో అయిపోయాడు.స్టార్ హీరోలు ఎవరూ కూడా కష్టకాలంలో సాయం చేయడానికి ముందుకు రాకుండా ఇంటివద్దనే ఉన్న కరోనాని లెక్కచేయకుండా వలస కార్మికులని ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు.
తరువాత కష్టం అనుకుంటు తనని ఆశ్రయించే ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారు.దీంతో అతను ఇప్పుడు అందరి దృష్టిలో ఒక హీరో అయిపోయాడు.
ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు సోనూసూద్ ని విలన్ గానే ప్రాజెక్ట్ చేసిన దర్శక, నిర్మాతలు కూడా ఆలోచన మార్చుకొని అతన్ని నెగిటివ్ రోల్స్ కాకుండా మంచి పవర్ ఫుల్ రోల్స్ లో ప్రెజెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారు.ఇప్పటికేఒప్పుకున్న సినిమాలలో కూడా అతని ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కీలక మార్పులు చేసి క్యారెక్టరైజేషన్ కి హీరోయిజం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.అల్లుడు అదుర్స్ సినిమాలో కూడా సోనూసూద్ పాత్రలో చిన్న చిన్న మార్పులు చేసినట్లు చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు సోనూసూద్ ఓ సినిమాలో మొదటిసారి పూర్తిస్థాయి హీరోగా నటించడానికి ఒకే చెప్పాడు.
కిసాన్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాను రాజ్ శాండిల్యా నిర్మిస్తున్నాడు.
నివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.ఈ సందర్భంగా సోనూసూద్ కొత్త సినిమాకు అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు.