నటుడు సోనూసూద్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. కరోనా కంటే ముందు ప్రముఖ విలన్ గా మాత్రమే ప్రజలకు తెలిసిన సోనూసూద్, కరోనా మొదటి వేవ్ లో అసలు కరోనా ఏమిటో అర్థం కాకుండా ఉన్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం సత్వర లాక్ డౌన్ విధించడంతో ఒక్కసారిగా ప్రజలు అయోమయంలో మునిగిపోయారు.
ఇక లాక్ డౌన్ లో ఎక్కువగా ఇబ్బంది పడింది వలస కార్మికులే.ఇక ఎటువంటి రవాణా సదుపాయం లేకపోవడంతో పొట్ట కూటి కోసం వచ్చిన కార్మికులు ఇక్కడ ఉపాధి కరువవడంతో ఇక తమ స్వంత ఊళ్ళకు కాలినడకన తమ పిల్లాపాపలతో కలిసి బయలు దేరారు.
ఆ దృశ్యాలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి.
ఇక ఆ సమయంలో వలస కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తన స్వంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేయించి ఒక్కసారిగా వలస కార్మికుల పట్ల దేవుడిగా మారిపోయాడు.
ఇక అప్పటి నుండి ప్రస్తుత సెకండ్ కరోనా వేవ్ లో కూడా తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నాడు.అయితే సోనూసూద్ కు తోడుగా సోనూసూద్ ఫౌండేషన్ కు చాలా మంది ప్రముఖులు సైతం తమ విరాళాలను సమర్పిస్తున్నారు.
అయితే తాజాగా టీమిండియా క్రికెటర్ కర్న్ శర్మపై సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించారు.సోనూసూద్ ఫౌండేషన్ కు నీ మద్దతు అందిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ, నీ లాంటి యూత్ మిగతా వారికి ఆదర్శం అంటూ క్రికెటర్ కర్న్శర్మ పై ప్రశంసలందించారు.