ప్రస్తుతం కరోనా వైరస్ సకాలంలో ప్రజలకి తనకు చేతనయినంత సహాయం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రముఖ విలక్షణ నటుడు సోనూ సూద్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎక్కడి నుంచో వలస వచ్చి సినిమా అవకాశాలు దక్కించుకొని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ వలస బాధితుల కష్టాలను తెలుసుకుని ఈ కరోనా సమయంలో వారి స్వస్థలాలకు చేరుకునేందుకు తన సొంత డబ్బుతో బస్సులు, విమానాలు ఏర్పాటు చేసి ఎంతో గొప్ప పని చేశాడు.
అయితే తాజాగా సోను సూద్ ఓ విషయం గురించి స్పందిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఇంతకీ ఆ విషయం ఏంటంటే తనకి సోషల్ మీడియా మాధ్యమాల నుంచి వందల సంఖ్యలో సహాయం కోసం నిత్యం మెసేజ్ లు వస్తున్నాయని ఒకవేళ ఎవరి మెసేజ్ అయినా చూడకపోతే తనను క్షమించాలని కోరాడు.
అంతేగాక ఒకవేళ సహాయం కోసం ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ ని తాను చూసి స్పందించక పోయినా వారికి సహాయం మాత్రం అందుతుందని తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సోను సూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.
కానీ ఈ విషయంపై సోనూ సూద్ లేదా ఆచార్య చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు స్పందించడం లేదు.దీంతో ఈ వార్తలో నిజం ఎంతో అనేది ఇంకా తెలియాల్సి ఉంది.