కరోనా సమయం దేశవ్యాప్తంగా మారుమోగిన పేరు సోనుసూద్.వృత్తిరీత్య నటుడిగా ఉన్న సోనుసూద్ సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలతో మెప్పించి తనదైన ముద్ర వేసుకున్నారు.
అయితే నిజ జీవితంలో మాత్రం హీరోగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.అడిగిన వారికి అడిగినట్లు గా సహాయం చేస్తూ, తన పెద్ద మనసును చాటుకుంటూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలకు దీటుగా సోనూసూద్ దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
లాక్ డౌన్ సమయం లో రోడ్ల వెంట జనాలు నడుస్తూ మృత్యువాత పడుతున్న తీరుతో కలత చెంది ఆ వ్యవహారాలపై స్పందించి ప్రత్యేకంగా బస్సులు, విమానాలు, రైళ్లు ఏర్పాటు చేసి వారి సొంత గ్రామాలకు తరలించడం , ఆ తర్వాత అనేక రూపాల్లో సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ సోనూసూద్ కు పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చాయి.దీంతో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడని, దేశవ్యాప్తంగా యాక్టివ్ కాబోతున్నారని ప్రచారం జరిగింది.
అయితే సోను మాత్రం తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, తాను తను సంతృప్తి కోసమే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.అయితే ఈ ఈరోజు సోనుసూద్ పొలిటికల్ ఎంట్రీపై ఒక స్పష్టమైన క్లారిటీ రాబోతోంది.ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సోనూసూద్ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు.2022 లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో, ఇప్పటి నుంచే కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే కేజ్రీ వాల్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ కానీ , ఆయన సోదరి కానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోనూసూద్ సోదరి మాల్విక సచ్చర్ కాంగ్రెస్ టికెట్ పై మెగా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలోనే సోనూసూద్ కేజ్రీవాల్ తో భేటీ కావడం తో జాతీయస్థాయిలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ రోజు సాయంత్రానికి సోనూసూద్ పొలిటికల్ ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.సోనుసూద్ ఆద్మీ పార్టీలో చేరినా, లేక మద్దతు ప్రకటించినా, రాజకీయ సమీకరణాలు వేరేగా ఉంటాయి.