కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిన విషయం మనకు తెల్సిందే.కరోనా మొదటి దశలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ముఖ్యంగా సామాన్యులు, చిన్న చిన్న వ్యాపారులు ఆకలి కేకల అర్థనాదాలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి.అయితే కరోనా సామాన్యుడి నుండి సెలెబ్రెటీ వరకు ఎవరినీ వదలడం లేదు.
ఇక లాక్ డౌన్ సమయంలో ఎక్కడి వారు ఎక్కడ ఉన్నా పొట్ట కూటి కోసం సొంత ఊరును, సొంత రాష్ట్రాన్ని వదిలి వలస వచ్చిన వలస కూలీల బాధలు వర్ణనాతీతం.ఇక ఎటువంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో పిల్లా పాపలను భుజాన వేసుకొని కాలినడకన బయలు దేరారు.
ఇక కొంత మంది నడిచి నడిచి మార్గ మధ్యలో నే మృతి చెందిన వారు ఉన్నారు.ఇక ఆ సమయంలో వీరదరికి నేనున్నానని ముందుకిచ్చిన సోనూసూద్ తన సొంత ఖర్చులతో బస్సులు వేయించి తన స్వస్థలాలకు పంపించి ఒక్కసారిగా వరందరి పాలిట దేవుడయ్యాడు.
ఇక ఆ తరువాత వైద్యం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయించడం ఇలా తనకున్న శక్తి మేరకు పేదలకు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు సోనూసూద్ .తాజాగా మరో సారి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్.
మంచిర్యాలకు చెందిన ఓ చిన్నారి వైద్యం కోసం ఏడు లక్షలు రూపాయలు ఖర్చు అవుతాయని డాక్టర్ లు చెప్పిన పరిస్థితులలో ఇక సహాయం కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఓ వ్యక్తి సోనూసూద్ కు ట్వీట్ చేయడంతో వెంటనే స్పందించిన సోనూసూద్ ఆర్ధిక సహాయాన్ని అందించాడు.తదుపరి వైద్య ఖర్చులు సైతం భరిస్తానని చెప్పి ఆ నిరుపేద కుటుంబానికి ధైర్యం నింపి మరో సారి రియల్ హీరో అనియంచుకున్నాడు సోనూ సూద్.