బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుడు అదుర్స్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 15న రిలీజ్ కి రెడీ అవుతుంది.
ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, నాభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కందిరీగ ఫార్మాట్ లోనే ఫుల్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు చూపించబోతున్నాడు.
ఇక ఇందులో సోనూసూద్ కూడా కీలక పాత్రలో నటించాడు.అయితే ముందుగా అనుకున్న ప్రకారం సినిమాలో సోనూసూద్ ని విలన్ గా రిప్రజెంట్ చేశారు.
అయితే లాక్ డౌన్ టైంలో సినిమా షూటింగ్ లు వాయిదా పడటంతో పాటు సోనూసూద్ ఒక్కసారిగా తన సోషల్ సర్వీస్ తో నేషనల్ హీరో అయిపోయాడు.అతని ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
అతనికి లక్షల మంది ఫ్యాన్స్ గా మారిపోయారు.సోనూసూద్ ని హీరో అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన జనం అతనిని విలన్ గా చూడటానికి ఇష్టపడకపోవచ్చనే అభిప్రాయం దర్శక, నిర్మాతలకి వచ్చింది.
దీంతో అల్లుడు అదుర్స్ కథలో కొన్ని కీలక మార్పులు చేసి క్లైమాక్స్ ని పూర్తిగా మార్చేసి సోనూసూద్ ని కూడా హీరోగా ప్రాజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈ కారణంగా ఇప్పుడు అల్లుడు అదుర్స్ మల్టీ స్టారర్ మూవీగా సందడి చేయబోతోందని టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమాలో సోనూసూద్ చేసిన పాత్ర విభిన్నంగా ఉండటంతో పాటు క్లైమాక్స్ లో హీరో ఎలివేషన్ ఉండటం సినిమాలో ట్విస్ట్ అని తెలుస్తుంది.ఇక సోనూని దృష్టిలో ఉంచుకొని ఆచార్య సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ మార్చమనిచిరంజీవి కొరటాలకి చెప్పినట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో పాత్ర ప్రెజెంటేషన్ లో మార్పులు చేసి సోనూని సరికొత్తగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది.అల్లుడు అదుర్స్ సినిమాలో సోనూసూద్, బెల్లంకొండ శ్రీనివా మామ అల్లుడు క్రింద కనిపించే అవకాశం ఉందని టాక్.