లాక్ డౌన్ తర్వాత దేశ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించిన పేరు సోనూసూద్.అలాగే ఎక్కువ మంది సోషల్ మీడియాలో కూడా వెతికిన పేరు కూడా ఇతనిధే.
కోట్ల రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలు లాక్ డౌన్ టైంలో ఇళ్లకే పరిమితం అయిపోయి ఉంటే వలస కార్మికుల కష్టాలు గుర్తించి సోనూసూద్ నేనున్నా అంటూ ముందుకొచ్చారు.కార్మికులని తన సొంత డబ్బులతో వారి గమ్య స్థానాలకు చేర్చాడు.
తాజాగా ఏపీలో ఒక రైతు కుటుంబానికి వ్యవసాయం కోసం ట్రాక్టర్ సాయం చేశాడు.అలాగే సాఫ్ట్ వేర్ చేసి ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న శారదా అనే అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడు.
ఇలా ఇప్పటి వరకు తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నాడు.స్టార్ హీరోలకి మించిన క్రేజ్ సోనూసూద్ కి వచ్చేసింది.
ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో చాలా గ్యాప్ తర్వాత సోనూసూద్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం సొంతం చేసుకున్నాడు.మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం సోనూసూద్ ని ఎంపిక చేశారు.
ఆచార్య చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర కోసం ఆయనను సంప్రదించడంతో ఆయనకి కూడా పాత్ర నచ్చడంతో ఈ చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో సోనూసూద్ ఎక్కువ సేపు ఆలోచించకుండా ఒకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది.
త్వరలో చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.