సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సోనుసూద్ నిజజీవితంలో ఎంతో మందికి ఎన్నో రకాల సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.కరోనా వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి సహాయసహకారాలు అందిస్తూ ప్రజలలో దేవుడిగా, కలియుగ కర్ణుడుగా పేరు సంపాదించుకున్న సోనుసూద్ కోసం ఎన్నో రాజకీయ పార్టీలు వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యాయి.
అయితే తాను ఇప్పుడే రాజకీయాల్లోకి రానని తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని సోనుసూద్ తెలిపారు.ఇకపోతే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలవారికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో రకాల సేవలు చేసిన సోనుసూద్ పేరు అవార్డుల జాబితాలో లేకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు స్పందిస్తూ… సోను సూద్ అమ్ ఆద్మీకి సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తన్న నేపథ్యంలో ఈయనకు పద్మ అవార్డుల జాబితాలో చోటు దక్కలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇలా సోనూసూద్ కి పద్మ అవార్డు రాకపోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఏకంగా 128 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింన సంగతి మనకు తెలిసిందే.