హైదరాబాదీల కోసం సోనుసూద్ భారీ నిర్ణయం..!!

కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ సమయం లో వలస కూలీలను ఆదుకుని సోనుసూద్ రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే.దేశంలో చాలామంది హీరోలు ఉన్నాగాని కష్టకాలంలో ప్రభుత్వాలు కూడా ముందుకు రాని సమయంలో సోను సూద్ తనలో ఉన్న మానవత్వాన్ని చాటుకున్నాడు.

 Sonu Sood Is A Big Decision For Hyderabadis, Sonu Sood, Hyderabad, Lock Down, Co-TeluguStop.com

కాగా తన సేవలు లాక్ డౌన్ కే పరిమితం కాకుండా ఇప్పటికీ కూడా దేశంలో పేద వాళ్ళని ఆదుకుంటూ కొంతమందికి చదువును చెప్పిస్తూ, మరికొంత మందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు.

కాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల సోనూసూద్ అనేకమందిని ఆదుకోవటం తో అతని క్రేజ్ బాగా పెరిగింది అన్న సంగతి తెలిసిందే.

కొన్నిచోట్ల సోనూసూద్ కి గుడి కూడా కట్టడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా సోనూసూద్ ఈసారి హైదరాబాదీల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

మేటర్ లోకి వెళ్తే కొన్ని వాహనాలను కొనుగోలు చేసి వాటిని అంబులెన్స్ గా మార్చి హైదరాబాద్ నగరంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.తాజాగా ట్యాంక్ బండ్ వద్ద ఈ వాహనాలను ప్రారంభించారు.

రానున్న రోజుల్లో హైదరాబాద్లో మాత్రమే కాక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా ఈ అంబులెన్స్ సర్వీసులు విస్తరించేలా సోనుసూద్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube