దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సోనూ సూద్ ను రియల్ హీరో అంటూ కీర్తిస్తున్నారు.ఆయన్ను దేశ వ్యాప్తంగా జనాలు దేవుడు అంటూ పూజలు చేస్తున్నారు.
ఈ సమయంలో ఆయన మెగా హీరోలను కీర్తించడం చర్చనీయాంశంగా మారింది.ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగా స్టార్ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించాడు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ఆక్సీజన్ బ్యాంక్ గురించి మాట్లాడుతూ అద్బుతమైన ఐడియా.అన్ని ప్రాంతాల్లో ఆక్సీజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు.
చిరంజీవి ఆ పని చేసి చాలా గొప్ప వ్యక్తిగా నిలిచారు.ఆయన ఇలాంటి పని చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అంటూ చిరంజీవిని ఉద్దేశించి పేర్కొన్నారు.
చిరంజీవి ప్రారంభించిన ఆక్సీజన్ బ్యాంకుల కారణంగా కొన్ని వేల మంది ఉచితంగా ఆక్సీజన్ ను పొందుతున్నారు.వందల నుండి వేల రూపాయలు పెరిగిన ఆక్సీజన్ రేటును భరించడం సామాన్యులకు సాధ్యం అవ్వడం లేదు.
ఇలాంటి సమయంలో చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ నిజంగా అభినందనీయం అంటూ సోనూ సూద్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సోనూ సూద్ కోట్ల రూపాయలతో వేలాది మందికి ఈ సమయంలో సాయంగా నిలిచాడు.
దేశం లోనే ప్రభుత్వం కంటే ఇప్పుడు సోనూసూద్ ను ఎక్కువ మంది నమ్ముతున్నారు.ఇలాంటి సమయంలో సోనూ సూద్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆ వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
రియల్ హీరో నే మా హీరో గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటూ వారు గొప్పలు చెబుతున్నారు.చిరంజీవి మరియు సోను సూద్ లు కలిసి ఆచార్య సినిమా లో నటిస్తున్నారు.సోనూసూద్ మరియు చరణ్ ల మద్య ఫైట్ సీన్ చిత్రీకరణ సమయంలో సోనూ సూద్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.
వీరిద్దరి కాంబో ఫైట్ సినిమా కు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.