ప్రస్తుతం దేశంలో కరోనా పెద్ద ఎత్తున విజ్రుంభిస్తోంది.సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి.మొదటి కరోనా వేవ్ లో కేసులు ఎక్కువగా పెరిగినా మరణాలు సెకండ్ వేవ్ తో పోలిస్తే తక్కువగా నమోదైన పరిస్థితి ఉంది.
కాని సెకండ్ వేవ్ లో కేసులు భారీగా నమోదవుతుండడంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.అయితే ఇప్పుడు ఆసుపత్రులు పూర్తిగా కోవిడ్ బాధితులతో కిక్కిరిసి పోతున్నాయి.
ఇక హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో అత్యవసరంగా ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.
ఇక తగినంత ఆక్సీజన్ కొరతతో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక అక్సీజన్ కోసం కోవిడ్ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు.అయితే సామాన్యులకే కాదు సెలెబ్రెటీలకు సైతం ఇటువంటి సమస్య ఎదురవుతోంది.
తాజాగా క్రికెటర్ సురేష్ రైనా తన ఆంటీకి తక్షణమే ఆక్సీజన్ అవసరం ఉందని, ఊపిరితిత్తులు పని తీరు క్షీణిస్తున్నదని అత్యవసరంగా ఆక్సీజన్ సిలిండర్ అందించాలని యూపీ సీఎం యోగిని సోనూసూద్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు.ఇక రైనా ట్వీట్ కు స్పందించిన సోనూ సూద్ నీకు 10 నిమిషాలలో ఆక్సీజన్ సిలిండర్ అందుతుందని రీట్వీట్ చేసాడు.
ఇక అత్యవసర సమయంలో స్పందించిన సోనూసూద్ కు సురేష్ రైనా కృతజ్ఞతలు తెలిపాడు.ఇక సోనూసూద్ ను నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.