కరోనా కష్ట సమయంలో ఎంతో మందిని ఆపద్బాంధవుడిలా ఆదుకొని ఎంతో మందికి ప్రాణ దాతగా నిలిచిన రియల్ హీరో సోనుసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే.సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ కష్ట సమయంలో సోను సూద్ వైపు చూడటంతో ప్రతి ఒక్కరికి తనకు చేతనైన సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్ గత రెండు సంవత్సరాల నుంచి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్నారు.
ఇలా ఈయనకు ఉన్న ప్రజాదరణ చూసి ఎంతో మంది ఇతనిని తమ రాజకీయ పార్టీలోకి ఆహ్వానించారు.అయితే రాజకీయాలకు దూరంగా ఉంటూ సమాజ సేవ పై దృష్టి పెట్టిన సోనుసూద్ తాజాగా రాజకీయ ప్రవేశం గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలోనే రాజకీయ ప్రవేశం గురించి సోనుసూద్ మాట్లాడుతూ మరో ఐదు సంవత్సరాల పాటు సమాజ సేవ చేసి అనంతరం రాజకీయాలలోకి వస్తానని తెలిపారు.
ఎప్పుడైతే ఈ పదవికి నువ్వే అర్హుడని అందరూ అంటారో అలాంటి సమయంలో తను రాజకీయాలలోకి వస్తానని, తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలోనే చేరుతానని ఈ సందర్భంగా సోను సూద్ తెలియజేశారు.ఇకపోతే ప్రస్తుతం పంజాబ్ లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోనూసూద్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన సోదరి మాళవికకు ప్రచారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ ఎన్నికల పై స్పందించిన సోను సూద్ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.